9 May, 2026 | 1:10 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

కాంతార3లో ఎన్టీఆర్?

06-08-2025 01:08 AM

కంటెంట్ బాగుంటేనే కమర్షియల్‌గా సక్సెస్ సాధ్యమనే విషయాన్ని ‘కాంతార’ నిరూపించింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడమేకాక ఆ సినిమాలో కీ రోల్ ప్లే చేశారు. ఇప్పుడు రెండోభాగం రాబోతోంది. ఓ వైపు పార్ట్ ఇంకా సెట్స్‌పైనే ఉండగానే మూడోభాగం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ‘కాంతార-3’ వార్తనే అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇందులో రిషబ్ శెట్టితోపాటు ఎన్టీఆర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం జరగడమే కారణం.

గతంలో ఎన్టీఆర్ తన తల్లి షాలిని నందమూరితో కలిసి బెంగళూరులోని ఓ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా రిషబ్‌శెట్టి వారికి ఆతి థ్యం ఇచ్చారు. అప్పుడే రిషబ్.. ఎన్టీఆర్‌తో ‘కాంతార-3’ కథపై చర్చించారట. ఎన్టీఆర్‌కు కథ బాగా నచ్చిందని, అందుకే ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.

ఎన్టీఆర్ తల్లి కర్ణాటకలోని కుందాపూర్‌కు చెందిన వ్యక్తి కావడం, ‘కాంతార’లో చూపించిన కోలా రిచ్యువల్స్‌తో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉండటం కూడా ఈ కాంబో కుదరడానికి కారణమని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ‘కాంతార-3’లో ఎన్టీఆర్ పాత్రపైనా ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ సీక్వెల్‌లో ఎన్టీఆర్‌ది కేవలం క్యామియో రోల్ కాదని, కథలో కీలకమైన పాత్రలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వుర్ ఇండియా’ కవర్ పేజీలో ఎన్టీఆర్ ఫొటోలు మొదటిసారి కనిపించడంతో అభిమానులు వాటిని సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నారు.