31-07-2025 08:26:15 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కోర్టు భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అధికారులు కేటాయించారు. సారంగాపూర్ మండలంలోని చించోలి.బి గ్రామ శివారులో 6.32 ఎకరాల భూమిని కోర్టు భవన నిర్మాణానికి కేటాయించారు. గురువారం ఈ స్థలాన్ని రెవెన్యూ, న్యాయ శాఖాధికారులు కలిసి పరిశీలించారు. ఈ పరిశీలనలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి రాధిక, ఆర్డీఓ రత్నాకళ్యాణి, తహసిల్దార్ శ్రీదేవి, ఇతర న్యాయ, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.