11 July, 2026 | 9:37 PM

Breaking News

ఆకట్టుకున్న ఐవీవై, సిద్ధార్థ రోబోటిక్స్ ఎక్స్ పో   •   సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుని ఎన్నిక   •   సుల్తానాబాద్ శ్రీ శివాలయంకు లలిత అమ్మవారి విగ్రహం అందజేత   •   జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం   •   ఆవుపై చిరుత దాడి   •   'పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యం'   •   కోనరావుపేటలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు   •   బేగంపేటలో దొంగల హల్‌చల్.. 20 పంపుసెట్ల విద్యుత్ కేబుళ్ల చోరీ   •   ఉద్యమానికి సిద్ధం.. 17న మందకృష్ణ మాదిగ రాక   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత చల్మెడ   •  

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్-1ను ప్రారంభించిన మంత్రులు

01-08-2025 05:33 PM

హైదరాబాద్: నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ (Yadadri Thermal Power Station) వద్ద 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్‌ను జాతికి అంకితమివ్వడం జరిగింది. ఈ యూనిట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka), ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ యూనిట్‌తో పాటు ఉద్యోగుల, ఇంజినీర్ల వసతుల కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణానికి పైలాన్ వద్ద శంకుస్థాపన చేయడం జరిగింది. తెలంగాణ అభివృద్ధికి ఇంధనం అందించే ఈ ప్రాజెక్టు రాష్ట్ర పరిశ్రమల విస్తరణకు బలమైన పునాది అవుతుంది. 

వైటీపీఎస్ పూర్తిస్థాయిలో ప్రారంభమైతే 4,000 మెగావాట్ల విద్యుత్‌ అవసరాలను తీర్చగల సామర్థ్యం ఉంది.  ఇప్పటివరకు 1,600 మెగావాట్ల సామర్థ్యాన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. గత ప్రభుత్వ కాలంలో నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు పనుల్లో రెండేళ్ల జాప్యం జరిగింది. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తిచేస్తోంది. పవర్ ప్లాంట్ పరిసర గ్రామాల ప్రజలకు ఉచితంగా విద్యా, వైద్య సదుపాయాలు కల్పించనున్నారు. అలాగే, భూ నిర్వాసితులైన యాదాద్రి, పులిచింతల ప్రాంతాల ప్రజలకు వచ్చే ఆగస్టు 15లోగా ఉద్యోగాలు, పునరావాస, పునరన్వయ (R&R) ప్యాకేజీ అందించనున్నారు.