17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

30-10-2025 12:13 AM

రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

హుజూర్‌నగర్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

మెంతా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం సూర్యాపేట జిల్లాలో కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులు పట్టణాల్లో, గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి అధికారులు సమన్వయనంతో పనిచేసి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.

అవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు బయటికి రావద్దని సూచించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు అందుబాటులో ఉండి అధికారులతో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.