17 April, 2026 | 2:38 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి యావజ్జీవ కారాగార శిక్ష

30-10-2025 12:14 AM

రూ. 30 వేల జరిమానా, జిల్లా కోర్టులో న్యాయమూర్తి శిక్ష ఖరారు

కామారెడ్డి, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 30 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్ స్టేషన్  పరిధిలో కేజీబీవీలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలిక మాచారెడ్డిలో వరుసకు నానమ్మ అయిన వాళ్లింటికి సెలవులు సమయంలో వచ్చేది.

అప్పుడప్పుడు కేజీబీవీ నుంచి వచ్చి రాత్రి సమయంలో అక్కడే నిద్రించేది. దసరా సెలవుల  సమయంలో వచ్చిన బాలిక ఎప్పటిలాగే రాత్రి నిద్రిస్తుండగా పక్కఇంట్లో ఉండే భూక్య గణేష్ అనే వ్యక్తి నిద్రిస్తున్న బాలికను నిద్రలేపి అరిస్తే చంపేస్తా అని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం విషయం ఎవరికీ చెప్పవద్దని భయపెట్టాడు. దాంతో విషయం దాచిపెట్టిన బాలిక పాఠశాలకు వెళ్లిన అనంతరం అనారోగ్యానికి గురైంది.

ఆ సమయంలో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పగా 2018 జనవరి 13న మాచారెడ్డి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దాంతో పోక్సో కేసు  నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కేసులో శిక్ష పడుతుందని భావించిన నిందితుడు గణేష్ విదేశాలకు పారిపోయినా తీసుకొచ్చి కోర్టులో హాజరుపర్చారు.

కోర్టులో పోలీసులు సాక్షాధారాలు సమర్పించగా నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 30వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. కేసు విచారణలో పాల్గొని నిందితుడికి శిక్ష పడేలా సాక్షాలు కోర్టులో సమర్పించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.