16 April, 2026 | 10:46 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

09-05-2025 10:01 PM

ముత్తారం,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్ర గాయాలు కాగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి -మంథని ప్రధాన రహదారి రంగయ్యపల్లి మూలమలుపు వద్ద గోదావరిఖనికి చెందిన శత్రువేదుల శ్రావణ్ తన సోదరుడు శశిధర్ ద్విచక్ర వాహనంపై భూపాలపల్లి జిల్లా జంగంపల్లి నుంచి గోదావరిఖనికి తిరుగు ప్రయాణంలో రంగయ్యపల్లి మూలమలుపు వద్ద ఉన్న టేకు చెట్లను ప్రమాదవశాత్తు ఢీకొట్టడంతో బైకు నడుపుతున్న శ్రావణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. శశిధర్ కు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు వెంటనే 108 సమాచారం ఇవ్వగా గాయపడ్డ వారిని మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.