18-08-2025 12:54:32 AM
భద్రాద్రి, మహబూబాబాద్, ములుగులో వర్షాలు
హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): ప్రస్తుతం వాయువ్వ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, రుతుపవన ద్రోణి, ఉపరీతల ఆవర్తనం కారణంగా రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతారణశాఖ తెలిపింది. సోమవారం కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోని పలు చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.