28 June, 2026 | 12:12 PM

Breaking News

రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •   ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం   •   కారు, లారీ ఢీకొని యువకుడు మృతి   •   విద్యుదుఘతంతో వాటర్ పిల్టర్ టెక్నిషియాన్ మృతి   •  

నామినేషన్ కేంద్రంలోకి ముగ్గురికే అవకాశం

06-12-2025 12:00 AM

జిల్లా కలెక్టర్ హైమావతి 

చేర్యాల, డిసెంబర్ 5: సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ దాఖలు చేసేందుకు కేంద్రంలోకి ముగ్గురికి మాత్రమే అవకాశం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు శుక్రవారం సిద్దిపేట జిల్లా చేర్యాల నియోజకవర్గంలోని మద్దూరు, రెబర్తి, దూల్మిట్ట, భైరాన్ పల్లి, దూల్మిట్ట నామినేషన్ కేంద్రాలను సందర్శించి మండల ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రాల100 మీటర్ల వరకు ప్రజలు ఉండవద్దని ఆదేశించారు.

నామినేషన్ దాఖలు చేసేందుకు అధిక సంఖ్యలో రావాల్సి వస్తే అందుకు సంబంధించిన వారికి టోకెన్స్ ఇవ్వాల్సిందిగా సభంధిత పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మద్దూరు దూల్మిట మండలములలో నామినేషన్ తీసుకునే సెంటర్స్ వద్ద ఎటువంటి సమస్య లేకుండా చూడాల్సిందిగా అక్కడి ఎంపీడీఓ, ఎంపీవో, కార్యదర్శులకు పలు సూచనలు చేశారు.