15 April, 2026 | 12:08 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు విడుదల

09-11-2025 07:30 PM

మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా..

కొత్తగూడెం (విజయక్రాంతి): నవంబర్ 11న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ విద్యాదినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఈ నెల 6న ఉత్తర్వులు జారీ చేయటం పట్ల మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యండీ. యాకూబ్ పాషా ఆదివారం నాడు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసారు.

భారతదేశపు మొట్ట మొదటి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర సమర యోధుడైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా నిర్వహించాలని 2015లో మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పటికి, రాష్ట్రంలో ఎక్కడ కూడా మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించకుండా నిర్లక్షం చేసారని, ఇట్టి విషయాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. దీంతో స్పందించిన మైనార్టీ సంక్షేమ శాఖ గత ఏడాది నుండి ఉత్తర్వులు జారీ చేయడము జరుగుతుందని అన్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్  కార్యాలయాల్లో నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.