10 May, 2026 | 2:47 PM

Breaking News

సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ   •   మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •  

పీఆర్ శ్రీజేశ్‌కు పద్మ భూషణ్

26-01-2025 12:19 AM

న్యూఢిల్లీ: కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో క్రీడల విభాగం నుంచి ఐదుగురు ఎంపికయ్యారు. భారత మాజీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్‌కు పద్మభూషణ్ అవార్డు లభించగా.. భారత పారా ఆర్చర్ హర్వీందర్ సింగ్, భారత మాజీ క్రికెటర్ ఆర్. అశ్విన్, అథ్లెటిక్స్ కోచ్ సత్యపాల్ సింగ్, మాజీ ఫుట్‌బాలర్ ఐఎమ్ విజయన్ పద్మశ్రీకి ఎంపికయ్యారు. టోక్యో, పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా పతకాలు సాధించిన భారత హాకీ జట్టులో పీఆర్ శ్రీజేశ్ సభ్యుడిగా ఉన్నాడు.  గతేడాది పారిస్ పారాలింపిక్స్‌లో ఆర్చరీ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి అథ్లెట్‌గా హర్వీందర్ నిలిచాడు.