14 April, 2026 | 5:06 PM

Breaking News

రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •   అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం   •   ప్రమాదరహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీజీపీ శివధర్ రెడ్డి   •  

పంచాయతీ ఎన్ని కల కోడ్ ఎత్తివేత

19-12-2025 12:37 AM
  1. సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతం 
  2. మూడు విడతల్లో 85.30 శాతం ఓటింగ్ నమోదు 
  3. ఎన్నికల విధుల్లో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశం 
  4. రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడి  

హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి) : రాష్ట్రం లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో గురువారం సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్ర వ్యప్తంగా ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల విధుల్లో పాల్గొని మరణించిన ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, ఆసిఫాబాద్ మిషన్ భగీరథ ఏఈ కట్ట రాజు కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్లను ఈసీ ఆదేశించింది. 

ఇక రాష్ట్ర వ్యాప్తంగా 12,727 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ చేయగా, కొన్ని చోట్ల వివిధ కారణాలతో ఎన్నికలు జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1205 గ్రామాలు, 25,848 వార్డులు ఏకగ్రీవం కాగా, 11,497 సర్పంచ్, 85,955 వార్డులకు ఎన్నికలు జరిగాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 85.30 శాతం ఓటింగ్ నమోదైందని, 1 కోటి 35 లక్షల 23 వేల 137 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.