calender_icon.png 23 May, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీలకు రూ.153 కోట్లు

22-05-2025 01:22:56 AM

9,990 బిల్లులు ఒకే రోజు క్లియర్ 

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీలకు రూ.153 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న 9,990 బిల్లులను ఒకే రోజున క్లియర్ చేసింది. ఒకే విడతలో రూ.10లక్షల లోపు బిల్లులను చెల్లించింది. 2024 ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ప్రభు త్వం ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. పంచాయతీలకు భారీగా నిధులు పెండింగ్‌లో ఉంటుండటంతో తాజాగా నిధులను విడుదల చేసింది. ఎస్‌డీఎఫ్ కింద చేపట్టిన పనులకు రూ.85 కోట్లను విడుదల చేసింది.