15 April, 2026 | 12:06 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి

06-11-2025 04:58 PM

ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల వేతనాలు, 7 నెలల పీఆర్ ఏరియర్స్ తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలలుగా వేతనాలు రాక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ ఉద్యోగులలాగా వీరికి కూడా ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని కోరారు.

ఈ నెల 17న హైదరాబాద్‌లోని NHM కమిషనర్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు టి.దివాకర్, ఉపాధ్యక్షుడు ఆత్మకూరు చిరంజీవి, కోశాధికారి నగేష్, సహాయ కార్యదర్శి రాందాస్, ఎన్ఎచ్ఎం సిబ్బంది శ్రీదేవి, ప్రకాష్, శ్రీకాంత్, విజయసాగర్, భవాని, సమత తదితరులు పాల్గొన్నారు.