06-11-2025 06:11:51 PM
నిర్మల్ రూరల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు పదో తరగతిలో బాగా మార్కులు రావాలంటే మంచిగా చదువుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అన్నారు. గురువారం సోన్ మండలం, పాక్ పట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు విద్య బోధన అడిగి తెలుసుకున్నారు మధ్యాహ్న భోజనానికి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకన్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు.