12 July, 2026 | 4:09 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

ఎన్నికల ప్రక్రియ గందరగోళంతో ప్రజలు

11-10-2025 06:14 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ గందరగోళంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్(బిఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు జక్కనపల్లి గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో స్థానిక సంస్థల పరిపాలన వ్యవధి ముగిసి, గ్రామీణ స్థాయిలో అభివృద్ధి కుంటుపడిందని, లోకల్ బాడీస్ లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయని అన్నారు. వ్యవధి ముగిసినప్పటి నుంచి ఇప్పటికి పలుమార్లు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ప్రకటనలు చేసి వాయిదా వేశారని, ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం హైకోర్ట్ స్టే తో ఎన్నికలు నిలిచివేయబడ్డాయన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ ల పెంపు సరైన నిర్ణయమే అయినప్పటికీ ప్రభుత్వం చట్టబద్ధమైన ప్రక్రియ అనుసరించకపోవడం ఎన్నికలు నిలిచిపోయాయాని అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం న్యాయకోవిదులతో చర్చించి, చట్టబద్ధంగా రిజర్వేషన్ లు, అదేవిధంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని డిమాండ్ చేశారు.