9 April, 2026 | 7:34 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

తిరుగు ప్రయాణానికి తిప్పలు రైళ్లు, బస్సుల్లో కిక్కిరిసిన జనం

06-10-2025 01:25 AM

మహబూబాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): దసరా సెలవులకు పట్టణాల నుండి పల్లెలకు వచ్చిన జనం తిరుగు ప్రయాణానికి అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం హైదరాబాద్ తోపాటు ఇతర పట్టణాలకు వెళ్లేందుకు రైళ్లు, బస్సులు ప్రయాణికులకు తగ్గట్టుగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కేసముద్రం రైల్వే స్టేషన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కలేక అనేకమంది ఆర్టీసీ బస్సులకు కోసం నిరీక్షించాల్సి వచ్చింది. అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. అనేక రైళ్లకు జనరల్ బోగీలు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

ఆర్టీసీ బస్సులు కూడా ప్రయాణికులతో నిండిపోయాయి. దీనితో చాలాచోట్ల పట్టణాలకు వెళ్లే ప్రజలు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకొందరు సోమవారం విధుల్లో చేరడానికి ఇబ్బందిగా మారుతుందని తిప్పలు పడుతూనే కిక్కిరిసిన రైళ్లలో ప్రయాణించారు. రైల్వే స్టేషన్ లతోపాటు బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి.