23 June, 2026 | 3:37 PM

ఫార్మా రైతులు పంట నమోదు చేసుకోవాలి

14-11-2025 01:13 AM

యాచారం నవంబర్ 13 :యాచారంలోని మేడిపల్లి, నానక్ నగర్ , తాటిపర్తి, కురమిద్ద, మరలకుంట తండా,  మంగళగడ తండాలకు చెందిన ఫార్మా కేసుల్లో ఉన్న రైతులందరు, యాచారం రైతు వేదికలో పంటలని నమోదు చేసుకోవలని ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల  సరస్వతి పేర్కొన్నారు.  పాసుబుక్, ఆధార్కార్డు తీసుకెళ్లి పంట నమోదు చేసుకోవాలన్నారు.  దీంతో రైతుల పత్తి పంట సీసీఐ, వడ్లు ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు ఆమె తెలిపారు.