23 June, 2026 | 2:28 PM

Breaking News

యూరియా కోసం రైతుల ధర్నా.. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్   •   పోతారంలో చిన్న వానకే చెరువులా ప్రధాన రహదారి   •   ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్   •   శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం   •   రవీంద్రభారతిలో కవి ద్యావరి నరేందర్ రెడ్డికి ఘన సత్కారం   •   సర్వే నంబర్ 218 బాధితులకు అండగా పువ్వాడ అజయ్ కుమార్   •   ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాలను సాగు చేస్తేనే రైతులకు బోనస్   •   గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి   •   డ్రైనేజీ సమస్యతో తేజాపూర్ వాసుల అవస్థలు   •   హైదరాబాద్ మెట్రో స్వాధీనం, విస్తరణపై చ‌ర్చలు సఫలం   •  

ప్లాస్టిక్ బ్యాగులను పట్టుకున్న కమిషనర్

14-11-2025 01:14 AM

మేడ్చల్, నవంబర్ 13(విజయ క్రాంతి): పట్టణంలో పలు హోటళ్ళు, దుకాణాలను మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాశ్ రెడ్డి తనిఖీ చేసి నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను పట్టుకున్నారు. పట్టణంలోని కెఎల్‌ఆర్ వెంచర్ శివాజీ విగ్రహం ప్రాంతంలో కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వినియోగిస్తున్న వ్యాపారులకు రూ.45 వేలు జరిమానా విధించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు ప్లాస్టిక్ వాడకం పై నిషేధం విధించినప్పటికీ కొంతమంది వినియోగిస్తున్నారని అన్నారు. ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వ్యాపారులు, ప్రజలు పర్యావరణహితమైన జూటు బ్యాగులు, కాగితపు బ్యాగులు వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రామచందర్, తదితరులు పాల్గొన్నారు.