13 April, 2026 | 4:20 PM

Breaking News

ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •   కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్   •  

పీఎం కిసాన్ నిధులు విడుదల

20-11-2025 12:00 AM

కోయంబత్తూరలో ప్రధాని మోదీ

చెన్నై, నవంబర్ 19: రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధులను విడుదల చేసింది. పధాని మోదీ కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 21వ విడత నిధులను ప్రధాని విడుదల చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కోయంబత్తూరులో బుధవారం ప్రకృతి వ్యవ సాయం పై నిర్వహించిన దక్షిణ భారత సదస్సులో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులఖాతాల్లో రూ.18 వేల కోట్లకు పైగా నిధులు జమకానున్నాయి. ప్రతి రైతుకు రూ.2వేలు అందుతుంది.

ప్రకృతి వ్యవసాయానికి కేరాఫ్ భారత్

బహిరంగ సభలో ప్రధాని మోదీ మా ట్లాడుతూ.. ‘సేద్యంలో రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగంతో నేల సారం దెబ్బ తింటుంది. పంట వైవిధ్యీకరణ, సేంద్రియ సాగుతో ఈ సమస్యకు పరిష్కా రం లభిస్తుంది. సేంద్రియ సాగులో ప్రపంచానికి కేంద్రంగా నిలిచే దిశగా భారత్ పయ నిస్తుంది’ అని పేర్కొన్నారు. తృణధాన్యాలను ‘సూపర్ ఫుడ్’గా పేర్కొన్నారు. ఈపంటలను సాగుచేయాలని రైతులకు పిలుపునిచ్చారు.