కవి శీలం రాజిరెడ్డికి సత్కారం
07-01-2026 12:00 AM
కేసముద్రం, జనవరి 6 (విజయక్రాంతి): ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఆద్వర్యంలో జనవరి 3,4,5 తేదీల్లో నిర్వహించిన 3వ తెలుగు ప్రపంచ మహసభల్లో ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన కవి శీలం రాజిరెడ్డి దంపతులను సత్కరించారు. ఆదివారం జరిగిన కవి సమ్మేళనంలో శీలం రాజిరెడ్డి పాల్గొని తన కవితలతో ప్రేక్షకులను అలరించారు.






