20-11-2025 12:00:00 AM
మేడ్చల్ అర్బన్, నవంబర్ 19 (విజయ క్రాంతి): మేడ్చల్లో రీ ఫిల్లింగ్ దందాపై సివిల్ సప్లై అధికారులతో పాటు పోలీసుల దాడులు నిర్వహించారు. పట్టణంలోని గోకుల్ నగర్ శివాలయం సమీపంలో మన్మధరావు ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిల్వ ఉంచిన సిలిం డర్లతో పాటు సిలిండర్లను రి ఫీలింగ్ చేసే సామాగ్రి ఉన్నట్లు గుర్తించారు. మన్మధ రావు తో పాటుమార్కెట్లో రీ ఫిల్లింగ్ చేస్తున్న ఇమ్రాన్ ను అరెస్టు చేశారు. ఈయన పెద్ద మొత్తంలో ఈ దందా చేస్తున్నాడు. ఈ దాడుల్లో వివిధ కంపెనీలకు చెందిన 94 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.