19 May, 2026 | 6:46 PM

Breaking News

తంగళ్లపల్లి మండలంలో తహసీల్దార్, ఎంపీడీవో పోస్టులు భర్తీ చేయాలి   •   విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగినప్పుడే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు   •   సింగరేణి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన యువతకు ఉద్యోగ అవకాశాలు   •   పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు కృషి చేయాలి   •   కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలు సాధించాలి   •   విద్యుత్ సరఫరా అంతరాయం   •   సుందరయ్య జీవితం స్ఫూర్తిదాయకం   •   ఎట్టకేలకు బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మల్లెపూల సత్యనారాయణ నియామకం   •   ఇంధన ధరల పెంపుతో సామాన్య ప్రజలపై అదనపు భారం   •   మైనార్టీ గురుకుల కళాశాలలో ఎంపీసీ, బైపీసీకి అడ్మిషన్ ప్రారంభం   •  

సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన

10-12-2025 12:21 AM

రామాయంపేట, డిసెంబర్ 9 :సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్థానిక సీఐ వెంకట రాజాగౌడ్, ఎస్త్స్ర బాలరాజ్ ఆధ్వర్యంలో రామాయంపేటలో కళాశాల విద్యార్థుల కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి కాలంలో సైబర్ క్రైమ్లు విపరీతంగా పెరిగినందున సెల్ ఫోన్లు ఉ పయోగించే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.

విద్యార్థులు సైబర్ నేరాల బారిన పడకుం డా మోసపోవద్దన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చక్కటి విద్యను అభ్యసించాలన్నారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారి సతీశ్, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, చత్రపతి శివాజీ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సందీప్ కుమార్,  విద్యార్థులు పాల్గొన్నారు.