1 July, 2026 | 7:16 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

యూరియా కోసం రైతులు.. ఎదురుచూపేనా?

12-09-2025 10:11 PM

పోలీస్ సిబ్బంది డ్యూటీ చేస్తున్న రైతులకు దొరకని బస్తాలు

సహకార సొసైటీ సిబ్బంది వికృత పోకడతో రైతులు గగ్గోలు

తుంగతుర్తి,(విజయక్రాంతి): గడిచిన 10 రోజులుగా రైతులు తమ వరి పొలాల్లో యూరియా వేసుకోవడానికి ఒక ప్రక్క సొసైటీలు, మరొక ప్రక్క ప్రైవేటు ఫెర్టిలైజర్ షాపుల్లో కొనుక్కోవడానికి బారులు తీరినప్పటికీ ప్రభుత్వం నుండి పూర్తిస్థాయిలో యూరియా నిలువలు లేకపోవడంతో రైతులకు అందుబాటులోకి రాకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని సహకార సొసైటీ కేంద్రంలో ప్రతిరోజు రైతులు బారులు తీరి, గంటల తరబడి నిలబడి, వారి ఆధార్ పాస్ పుస్తకాలను పెట్టి,  రెండు రోజులు గడిచిపోగా, పాపం పోలీస్ సిబ్బంది కూడా డ్యూటీ చేస్తూ, ఒక్కొక్క రైతుకు ఒక్కొక్కటిస్తున్న తరుణంలో శుక్రవారం ఓ పలుకుబడి గల వ్యక్తి నలుగురు పేర్ల మీద, సుమారు పది బస్తాలు తీసుకొని, ఆటోలో వేశారు.

ఇది గమనించిన స్థానిక రైతులు కోపోద్రిక్తులై పోలీసులపై తిరగబడి దూశిస్తూ, ఆటోలో ఉన్న యూరియా బస్తాలను బయటకి లాగేశారు. అందులో కొన్ని బస్తాలు కూడా రైతులు ఎత్తుకొని వెళ్ళినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనితో రైతులు కోపోద్రిక్తులై నిరసన వ్యక్తం చేశారు. స్థానిక వ్యవసాయ సంచాలకులు రమేష్ బాబు, ఒక్కొక్క రైతుకు పాసుబుక్కు ఆధార్ కార్డు ఉంటే, ఒక్కటి మాత్రమే ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ, సొసైటీ సిబ్బంది తుంగలో తొక్కి, యూరియా బస్తాలు పక్క దారిన పట్టిస్తున్నట్లు రైతులు ఆరోపించారు. జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ప్రతి రైతుకు ఒక్కొక్క యూరియా బస్తా, చేరే విధంగా కృషి చేయాలని స్థానిక రైతులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు కోరుతున్నారు