10 May, 2026 | 2:51 PM

Breaking News

సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ   •   మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •  

ప్రభుత్వ నిర్లక్ష్యంతోని చెరువులకు గండ్లు: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

17-09-2025 05:33 PM

నిర్మల్(విజయక్రాంతి): చెరువుల మరమ్మత్తుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే చెరువులకు గండు పడుతున్నాయని బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు బుధవారం సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో భారీ వర్షాలకు తెగిపోయిన పెద్ద చెరువును బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి  పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి పంట నష్టపోయిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెరువు తెగిపోవడంతో వరి పంట పూర్తిగా దెబ్బతిన్నదని ఇసుక మేటలతో అపార నష్టం కలిగిందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులతో మాట్లాడి నష్టపరిహారం అందేల చూస్తానని భరోసా ఇచ్చారు. చెరువు మరమ్మత్తులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.