16 April, 2026 | 9:02 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

రాములవారిని దర్శించుకున్న పొంగులేటి దంపతులు

09-05-2025 12:00 AM

భద్రాచలం, మే 8 (విజయక్రాంతి) ః తెలంగాణ రాష్ర్ట రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగిలేటి శ్రీనివాస్-మాధురి దంపతులు పెళ్లిరోజు సందర్భంగా గురువారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులకు అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు.

వేద పండితులు స్వామివారి సుప్రభాత సేవకు హాజరైన మంత్రివర్యులకు సుప్రభాత సేవతో పాటు గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి గోత్రనామాలతో పూజలు చేసి స్వామివారి పట్టు వస్త్రాలు తీర్థప్రసాదాలు అందించారు.

అనంతరం ఐటిసి గెస్ట్ హౌస్ లో పెళ్లి రోజు సందర్భంగా కేక్ కట్ చేసి మంత్రివర్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మంత్రి దంపతులకు జ్ఞాపకను అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు  రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.