3 July, 2026 | 11:42 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి

01-08-2025 12:22 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి టౌన్, జూలై 31 : జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన చాంబర్లో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో అదన కలెక్టర్ స్థానిక సంస్థల యాదయ్య తో కలిసి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీలో వర్షాల కారణంగా ప్రజలకు సమస్యలు తలెత్తే పెద్దపెద్ద నాళాలు డ్రైనేజీలు గుర్తించాలని, వాటిని బాగు చేయించేందుకు ప్రణాళికలతో నివేదిక పంపాలని ఆదేశించారు.

మరీ ముఖ్యంగా జనావాసాలకు ఇబ్బందులు కలిగించే పెద్ద పెద్ద డ్రైనేజీలకు సంబంధించిన జాబితా సిద్ధం చేసి బాగు చేయించే ప్రణాళికలు చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్వర్లు, గణేష్, శశి ధర్, ఇతర మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.