23 June, 2026 | 7:52 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి

18-10-2025 12:46 AM

పాలమూరు నేత్ర వైద్యుడు పి.కిశోర్‌కుమార్

 మహబూబ్‌నగర్, అక్టోబర్ 17(విజయక్రాంతి): దీపావళి పండు గ సందర్భంగా టపాసులు, ఇతర సామగ్రి కాల్చేటప్పుడు త గు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖ్యాత టాపికల్ పాకో సర్జన్, ఐసీఎల్ సర్జన్,మెడికల్ రెటీనా స్పెషలిస్ట్, పాలమూరు కంటి వైద్యశాల డాక్టర్ కిశోర్ కుమార్ సూచించారు. ఈ మేరకు పాలమూరు కంటి వైద్యశాల ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో డాక్టర్ ఆయన మాట్లాడారు. కంటికి గాయమైతే చేయాల్సినవి, చేయకూడనివి ఈ సందర్భంగా కిశోర్‌కుమార్ వివరించారు.

టపాసులు కాల్చేటప్పుడు కంటికి గాయం అయితేవెంటనే వైద్య సహా యం పొందాలని సూచించారు. కంటిని మృదువుగా కడగాలని, కం టికి రక్షణ కల్పించాలని, కన్ను నలపకూడదన్నారు. గృహ వైద్యాలు ఉప యోగించకూడదు అన్నారు. కంటి లోపలి తునకలను తొలగించవద్దన్నా రు. గాయానికి నూనె ఇతర క్రీములు పూ యకూడదన్నారు. టపాకాయలు వెలిగించే సమయంలో కేవలం మందంగా ఉన్న నూలు దుస్తులు ధరించాలని, అన్ని దుస్తులనూ బిగుతుగా ఉండేలా చూ సుకోవాల న్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో పాలమూరు కంటి వైద్యశాల హెల్ప్ లైన్ నెంబర్ 91691 73918 లో సంప్రదించాల్సిందిగా డాక్టర్ కిశోర్‌కుమార్ కోరారు.