16-08-2025 12:00:00 AM
హెడ్ కానిస్టేబుల్కు ప్రశంసాపత్రం అందజేసిన ఎస్పీ చందనా దీప్తి
బెల్లంపల్లి అర్బన్, ఆగస్టు 15: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన జీఅర్పీ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మారెడ్డి ఉత్తమ సేవలకు ప్రశంస పత్రం అందుకున్నారు. బెల్లంపల్లి రైల్వే అవుట్ పోస్టులో రెడ్ కానిస్టేబుల్ గా లక్ష్మారెడ్డి పనిచేస్తున్నారు. ఆయన చేసిన ఉత్తమ సేవలకు గాను 79 వ స్వాతంత్ర వేడుకలు సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ చందన దీప్తి ప్రశంసాపత్రం అందజేసి సత్కరించారు.
ఎస్సుకి ప్రశంసాపత్రం అందజేసిన సీపీ
రామగుండం పోలీస్ కమిషనరేట్ లో స్పెషల్ బ్రాం ఎస్సుగా పనిచేస్తున్న బెల్లంపల్లికి చెందిన మామిడి రాజన్నకు శుక్రవారం 79వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో సిపి అంబర్ కిషోర్ జూ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఎస్సు రాజన్న పౌర సేవలు ఉత్తమ విధులు నిర్వహించినందుకు అతనికి పోలీ సు శాఖ తరపున ప్రశంసా పత్రాన్ని అందించారు. సిపి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకోవడం చాలా ఆనందాన్నిచ్చిందని, ప్రశంసా పత్రాన్ని అందుకోవడం వల్ల పో లీసు శాఖలో తన బాధ్యత మరింత పెరిగిందని ఎస్సు రాజన్న తెలిపారు. ఈ సంద ర్భంగా సీపీ అంబర్ కిషోర్ జూ, పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.