10-07-2025 12:05:38 AM
శామీర్ పేట్ 09 జులై 2025; ఉమ్మడి శా మీర్ పేట మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్ల బ్ నూతన కమిటీ అధ్యక్షుడు క్యాతం రవి ఆధ్వర్యంలో బుధవారం శామీర్ పేట్ ప్రిం ట్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని అతిథులు ప్రారంభించారు.
మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, శామీర్ పేట ఎస్ హెచ్ ఓ శ్రీనాథ్, జీనోమ్ వ్యాలీ ఎస్ హెచ్ ఓ వెంకటరెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ డాక్టర్ రామిడి మధుకర్ రెడ్డి, జిల్లా ఆర్టిఏ మెంబర్ భీమిలి జైపాల్ రెడ్డి, జిల్లా టీ యూ డబ్ల్యూ జే అధ్యక్షులు గడ్డమీది బాలరాజ్, ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డిలు ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శామీర్పేట మండలం టిఆర్ఎస్ అధ్యక్షులు సర సం మోహన్ రెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షు లు శంకర్ గౌడ్ శామీర్ పేట్ డిఐ రాజు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇంటలిజెన్స్ రవీందర్, ఏ ఎం సి డైరెక్టర్ శ్వేత, కాంగ్రెస్ నేత రమేష్ తదితరులుపాల్గొన్నారు.