15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కొండగట్టులో అర్చకుల ధర్నా

24-01-2026 12:26 AM
  1. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా టీడీపీ నాయకుల పూజలు
  2. ఎందుకు చేశారని అర్చకులపై ఈవో మండిపాటు
  3. ఈవో తీరుకు వ్యతిరేకంగా అర్చకుల నిరసన

కరీంనగర్, జనవరి 23 (విజయక్రాంతి): కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆలయ ఈవో శ్రీకాంత్‌రావు వైఖరికి నిరసనగా ఆలయ అర్చకులు రాజగోపురం ముందు ధర్నాకు దిగా రు. ఏపీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను శుక్రవారం కొండగట్టులో టీడీపీ నాయకు లు జరుపుకున్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ద్వారా ఫోన్ చేయించుకొని లోకేష్ పేరు మీద అర్చనలు చేయించుకున్నారు.

దీంతో ఆలయ ఈవో అర్చకులను మందలించడమే కాకుండా మీపై చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో అర్చకులకు, ఈవోకు మధ్య వివాదం చెలరేగింది. అర్చకులు రాజాగోపురం ముందు నిరస నకు దిగారు. ఈవో తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ, అర్చకులను జిల్లా స్థాయి అధికా రులను సైతం దుర్భాషలాడుతున్నట్టు ఇప్పటికే ఫిర్యాదులు ఉన్నాయి.

ఈవో తీరు కారణంగా  తమకు, ఉద్యోగులకు మధ్య సమన్వయ లోపం ఏర్పడినట్లు అర్చకులు తెలిపారు. ఈవోపై తక్షణ విచారణ చేపట్టాలని, ఆలయ పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాగా అర్చకుల నిరసన కారణంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులను మో హరించి భద్రత కట్టు దిట్టం చేశారు.