calender_icon.png 8 September, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలను విని చట్టప్రకారం పరిష్కరించాలి

02-09-2025 12:00:00 AM

ప్రజావాణిలో  ఫిర్యాదులు స్వీకరించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

నిజామాబాద్ సెప్టెంబరు 1:(విజయ క్రాంతి): నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచన లు సిపి చేశారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల యొక్క ఎస్.ఐ మరియు సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని పరిష్కారానికి సూచనలు చేశారు.

ప్రతి సోమవారం నిర్వహించే ఈ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని    సి పి.సాయి చైతన్య స్పష్టం చేశారు,  ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి  కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నాము సాయి చైతన్య తెలిపారు.