08-09-2025 02:00:56 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) : పాతబస్తి ప్రజల చిరకాల స్వప్నమైన మెట్రో రైలు కనెక్టివిటీని సాకారం చేయడానికి అన్ని ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. 7.5 కిలోమీటర్ల పాతబస్తి మెట్రో కారిడార్లో భూసేకరణ, ప్రభావిత ఆస్తుల కూల్చివేత పనులు కీలక దశకు చేరుకున్నాయని, అవసరమైన రైట్ ఆఫ్ వే ఇప్పుడు దాదాపు అందుబాటులో ఉందని ఆయన వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. తొలుత ప్ర భావిత ఆస్తుల అంచనా 1,100గా ఉన్నప్పటికీ, వినూత్న ఇంజనీరింగ్ పరిష్కారాల ద్వా రా ఈ సంఖ్యను 886కి తగ్గించగలిగారు. ఇప్పటికే 550కి పైగా కూల్చివేతలు పూర్తయ్యాయని, మిగిలిన నిర్మాణాలను తొల గించే పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
ఆస్తి యజమానులకు ఇప్పటివరకు రూ.433 కోట్ల పరిహారం పంపిణీ చేశామని ఆయన తెలిపారు. వర్షా లు, పండుగలు, మొహర్రం వంటి సవాళ్లు ఎదురైనప్పటికీ, స్థానిక నివాసితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పనులు సజావుగా సాగాయని రెడ్డి వివరించారు. సం క్లిష్టమైన విద్యుత్ కేబుల్ల తొలగింపు కొంత జాప్యాన్ని కలిగించినప్పటికీ, వాటిని విజయవంతంగా అధిగమించామన్నారు.
మెట్రో స్తంభాలు, స్టేషన్ల నిర్మాణానికి సంబంధించిన సన్నాహక పనులు పూర్తిస్థాయిలో జరు గుతున్నాయి. ఇందులో ప్రధానంగా.ఖచ్చితమైన మ్యాపింగ్ కోసం డిఫరెన్షియల్ జీపీఎ స్ సర్వేలు భూగర్భ యుటిలిటీలను గుర్తించి తరలించడం,అలైన్మెంట్లోని సున్నితమైన వారసత్వ కట్టడాల పరిరక్షణ వంటి అంశాలపై దృష్టి సారించారు. సాధారణ సర్వేలతో పోలిస్తే, డీజీపీఎస్ ఖచ్చితమైన డిజిటల్ మ్యాపింగ్ను అందిస్తుంది.
అమలును వేగవంతం చేయడానికి డీజీపీఎస్ నుండి పొం దిన డేటాను గత డ్రోన్ సర్వేల డేటాతో అనుసంధానించారు. స్తంభాల స్థానాల్లో భూగర్భ అడ్డంకులను గుర్తించి, మళ్లించడం యొక్క ప్రాముఖ్యతను ,రోడ్ల పురాతనత్వాన్ని బట్టి, నీరు, మురుగునీరు, తుఫాను నీటి కాల్వలు, విద్యుత్, టెలికాం లైన్లు భూమి కింద ఉన్నాయని ఆయన వివరించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం, రోడ్డును 100 అడుగులకు విస్తరిస్తున్నారు, దీనికి ప్రభావిత ఆస్తులను కూల్చివేయడం అవసరం.
హైదరాబాద్ వాటర్ బోర్డు, జీహెఎంసీ, టీజీఎస్పీడీసీఎల్, బీఎస్ఎన్ఎల్ వంటి ఏజెన్సీలు యుటిలిటీలను తరలించడానికి సహకరిస్తున్నాయి. భూగర్భ నిర్మాణాలను, పదా ర్థాలను గుర్తించడానికి గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు. మెట్రో అలైన్మెంట్ అనేక సున్నితమైన వారసత్వ కట్టడాల గుండా వెళుతుందని, వాటిని గుర్తించి, అలైన్మెంట్ను తదనుగుణంగా సర్దుబాటు చేశామని రెడ్డి తెలిపారు.
ఈ అలైన్మెంట్ ఆధారంగా స్తంభాల స్థానాలను గుర్తించి, నిర్మాణ పనులకు మార్గదర్శకంగా ప్రతి 100 మీటర్లకు మైలురాయి మార్కర్లను ఏర్పాటు చేస్తున్నారు. పాతబస్తి మెట్రో రైలు పనులను త్వరలో ప్రారంభించడానికి అవసరమైన అన్ని సాంకేతిక సన్నాహాలు పూర్తిస్థాయిలో జరుగుతు న్నాయని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.