11 May, 2026 | 1:28 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

ప్రొ. కోదండరాం ఎమ్మెల్సీ నియామకం హర్షణీయం

16-08-2024 08:51 PM

హుజురాబాద్:  ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీగా నియమించినందుకు టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసారు. తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంని ఎమ్మెల్సీగా నియమించినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రి వర్గానికి ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. 

గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ఉద్యమకారులను గుర్తించకుండా, గౌరవించకుండా అణచివేత ధోరణి అవలంబించడం జరిగిందన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తూ, గౌరవిస్తూ సముచిత స్థానం కల్పిస్తున్నందుకు తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నదని ముక్కెర రాజు పేర్కొన్నారు. ప్రజలందరికీ నాణ్యమైన, ఉచిత విద్యను అందించేందుకు, విద్యావ్యవస్థ పటిష్టపరిచేందుకు కోదండరాంని మంత్రివర్గంలోకి తీసుకుని విద్యాశాఖను కేటాయించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.