10-12-2025 02:06:12 AM
వేడుకలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర గవర్నర్కు ఆహ్వాన పత్రిక అందజేత
హైదరాబాద్(నార్సింగి/కోకాపేట్), డిసెంబర్ 9(విజయక్రాంతి): హరేకృష్ణ మూవ్’మెంట్, హైదరాబాద్ ఆధ్వర్యంలో డిసెంబర్ 13న, శనివారం సాయంత్రం, కోకాపేట్ నుంచి నార్సింగిలోని హరేకృష్ణ హెరిటేజ్ టవర్ వరకు నాలుగో వార్షిక శ్రీరాధా గోవింద రథయాత్ర ఉత్సవం జరగనుంది.
ఈ సందర్భంగా మంగళవారం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ను కలిసి ఈ ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా హరేకృష్ణ మూవ్’మెంట్ అధ్యక్షుడు, అక్షయపాత్ర ఫౌండేషన్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ప్రాంతీయ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభూజీ (ఎంటెక్, ఐఐటీ మద్రాస్) ఆహ్వానించారు. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించి ఆహ్వాన పత్రికను గవర్నర్కు అందజేశారు.