13 April, 2026 | 1:42 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

రాధాకృష్ణచారికి మహానంది పురస్కారం

26-01-2026 01:34 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 25(విజయక్రాంతి): జిల్లా కేంద్రానికి చెందిన కవి, రచయిత, జర్నలిస్ట్ చిలుకూరి రాధాకృష్ణ చారికి మహానంది పురస్కారం లభించింది. తెలుగు ఇండియన్ కల్చర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ కాళోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు వెలుగు సాహితీ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన 2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వరంగల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా సాహిత్య, పత్రికా సేవ రంగాల్లో రాధాకృష్ణ చారి అందించిన విశిష్ట సేవలను గుర్తించి మహానంది పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ప్రముఖ హాస్య నటుడు ఆర్.ఎస్. నంద చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేసి శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.