29-08-2025 01:22:13 AM
గుమ్మడిదల, ఆగస్టు 28 : గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి ఏరియాలో అంబేద్కర్ విగ్రహం వద్ద వర్షం నీరు నిలువ ఉండకుండా మున్సిపల్ కమిషనర్ దశరథ్ తొలగింపు చర్యలు చేపట్టారు. విజయక్రాంతి దినపత్రికలో విద్యా ర్థులకు తప్పని తిప్పలు అనే కథనం ప్రచురించగా ఇందుకు స్పందించిన కమిషనర్ ద శరథ్ నిల్వ ఉన్న వర్షపు నీటిని తాత్కాలికంగా తొలగింపు చేపట్టారు.