15 June, 2026 | 3:03 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

కొత్తగూడెంలో అరుదైన సర్పం పట్టివేత

06-08-2025 12:00 AM

కొత్తగూడెం,/మణుగూరు, ఆగస్టు 5, (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని సింగరేణి బంగ్లోస్ క్వార్టర్స్ లో సోమవారం రాత్రి 11 గంటలకు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది కి పాము కనిపించగానే ప్రాణధార ట్రస్ట్ స్నేక్ రెస్క్యూ సభ్యుడు ముజఫర్ కు సమాచారం ఇవ్వడంతో వెంటనే వెళ్లి పట్టుకున్నాడు. తానూ గతంలో ఇలాంటి పామును చూడలేదనీ, సందేహించి చరవాణిలో ప్రాణదార ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్ కు తెలుపగా, అది విషపూరితమైన కట్లపాము జాతికి చెందిన బాండెడ్ కైట్ స్నేక్ అని, హిమోటాక్సిన్ విషం కలిగినదని,

ఈ సర్పం గుండ్రంగా కాకుండా మూడు పలకలుగా ఉండి సమాన వెడల్పు గల పసుపు, నలుపు చారలతో ఆకర్షనీయంగా ఉంటుందన్నారు. ములుగు, ఏటూరునాగారం ప్రాంతాల్లో ఉంటుందని, రాత్రుళ్ళు మాత్రమే సంచరిస్తుందని, గతంలో ఏటూరు నాగారం రక్షకభట నిలయంలో రెండు సార్లు వచ్చినట్లు పోలీసు సిబ్బంది ఫోన్ చేశారని అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ అరుదైన సర్పం కనిపించడం ఇదే తొలిసారి అని సంతోష్ వివరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యుడు ముజఫర్ ను స్థానికులు, ప్రాణధార ట్రస్ట్ నిర్వాహకుడు సంతోష్ అభినందించారు