14 April, 2026 | 5:11 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

బీసీ బంద్.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉద్రిక్తత

18-10-2025 01:33 PM

పోటాపోటీ నినాదాలు, పోలీసుల జోక్యంతో ప్రశాంతం

వలిగొండ, (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం చేపట్టిన బంద్(BC Bandh) ఫర్ జస్టిస్ వలిగొండ మండల కేంద్రంలో ఉద్రిక్తంగా మారింది. బంద్ సందర్భంగా ముందుగా కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సీపీఐ, బీసీ సంఘాలతో కలిసి రాస్తారోకో చేస్తుండగా బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఇరువర్గాల వారు ఒక పార్టీపై మరొకరు బీసీ రిజర్వేషన్లకు అడ్డు అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే స్థానిక ఎస్.ఐ యుగంధర్ గౌడ్ ఇరు పార్టీల నాయకులకు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగి రాస్తారోకో ప్రశాంతంగా కొనసాగింది.