14 April, 2026 | 5:13 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

కాంగ్రెస్ మోసం చేస్తుంది

18-10-2025 12:36 PM

 బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందే

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): బీసీలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ మోసం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ... స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు బందును పాటించి బీసీలకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రజలకు మోసం చేయకుండా 42 శాతం రిజర్వేషన్ అమలు చేసే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ అమలు అయ్యేదాకా తమ పోరాటం ఆగదని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో టిఆర్ఎస్ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.