2 May, 2026 | 9:24 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

రియల్టర్ సిరిగిరి రమేష్ దారుణ హత్య

20-09-2025 01:33 PM

రాజన్న సిరిసిల్ల:(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో(Rajanna Sircilla ) కలకలం రేగింది. వేములవాడ అర్బన్ మండలం నంది కమాన్ సమీపంలో రియాల్టర్ సిరిగిరి రమేష్ దారుణ హత్యకు గురయ్యారు. రమేష్ గత 20 ఏళ్ల నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వేములవాడకు చెందిన వ్యక్తి గాంధీనగర్ నివాసి అయినా ఎద్దండి  దేవరాజు ఈ హత్య చేసినట్లు తెలిసింది. హంతకుడు హతుడి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వీరి మధ్య ఒక ఫ్లాట్ కు సంబంధించిన భూ వివాదంతోనే ఈ హత్య జరిగినట్లు సమాచారం. హత్య అనంతరం నిందితుడు వేములవాడ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. కాగా రమేష్ ను కారు లోనే గొంతు కోసి  చంపాడు. రియల్టర్ హత్య జిల్లాలో సంచలనం మారింది.