4 April, 2026 | 3:45 PM

Breaking News

మేడ్చల్ పెద్ద చెరువు కట్ట పైనుంచి కిందకు రోడ్డు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి   •   రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి — మాస్టర్‌ ప్లాన్​పై సీఎం రేవంత్ సమీక్ష   •   ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •  

లక్షల సంవత్సరాల చరిత్రకు ఆనవాళ్లు..

11-10-2025 10:33 PM

సింగరేణి నేలపై అంత‌రించిన‌ స్టెగోడాన్ ఏనుగు అవశేషాలు

పెద్దపల్లి (విజయక్రాంతి): రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామ‌గుండం ఏరియా-1లోని మేడిపల్లి ఉపరితల గనిలో స్టెగోడాన్ జాతి ఏనుగు దవడ, దంతాలు బ‌య‌ట‌ప‌డింది. ఈ నేల‌లో నిక్షిప్త‌మైన ల‌క్షల ఏళ్ల‌ చరిత్రకు సాక్ష్యంగా నిలిచాయి. ఈ స్టెగోడాన్ జాతి ఏనుగులకు ఒక విశేషమైన లక్షణం, వాటి దంతాలు సుమారు 10 అడుగుల పొడవు వరకు ఉంటాయి. అంటే ఒక బస్సు పొడవులో మూడో వంతు! వాటి ఎత్తు సుమారు 13 అడుగులు, బరువు 12.5 టన్నులు వరకు ఉండేది. ప్రకృతి, చరిత్ర, విజ్ఞానం కలిసిన సింగరేణి నేల భారత వారసత్వానికి మరో గర్వకారణం! భూమి పొరల్లో నిక్షిప్తమైన నల్ల బంగారంతో వెలుగులు పంచడమే కాకుండా, భూగర్భ చరిత్రను పదిలంగా కాపాడి భవిష్యత్ తరాలకు విజ్ఞానాన్ని పంచే గొప్ప బాధ్యతను సింగరేణి నిర్వర్తిస్తున్నది.