14 April, 2026 | 5:12 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

ఘనంగా గణతంత్ర వేడుకలు

27-01-2026 01:45 AM

న్యాయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, జనవరి 26: సిటీ సివిల్ కోర్టు న్యాయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం 76వ గణతంత్ర  వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర న్యాయ ఉద్యోగుల సంఘం ప్రముఖులు ఎస్‌వీ సుబ్బయ్య ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్య త అని అన్నారు. న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. దేశాభివృద్ధిలో న్యాయ విభాగం పాత్ర ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో బి. రామసుబ్బారెడ్డి, జి.సాయి కుమార్,వజ్రం, ప్రసాద్, ఆర్.ఉద య్, శివశంకర్, రాకేష్ కుమార్, నరేష్ యాదవ్, మనీష్ తదితరులు ఉన్నారు.