15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఒక్క రోజు వేతనం చెల్లించాలని వినతి

22-12-2025 10:13 PM

నస్పూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో ఇటీవల జరిగిన సర్పంచ్, వార్డు సభ్యుల రెండవ విడత ఎన్నికల్లో దేవపూర్ సిమెంట్ కార్మికులకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవు దినాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు సోమ వారం బహుజన్ సమాజ్ పార్టీ (BSP) జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాపూర్ సిమెంట్ కంపెనీ యజమాన్యం ఎలక్షన్ రోజున వేతనంతో కూడిన సెలవు దినాన్ని ప్రకటించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మంచిర్యాల జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో BSP మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ దాగం శ్రీనివాస్, సామాజిక నాయకులు పెరుగు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.