16 April, 2026 | 10:08 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

‘ఉపాధి హామీ’ని రద్దు చేయాలని కేంద్రం చూస్తోంది

23-12-2025 12:20 AM
  1. గాంధీ పేరు తొలగించవద్దు
  2. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు  

హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి ) : మహాత్మగాంధీ పేరు తో ఉన్న జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని ర ద్దు చేయడం సరికాదని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు విమర్శించారు. నోట్లపై ఉన్న గాంధీ బొమ్మను తీసి సావర్కర్ బొమ్మ పె ట్టాలని మోదీ చూస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. సోమవారం ఆయన గాంధీభ వన్‌లో మీడియాతో మాట్లాడుతూ మోదీ చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు ప్రజలు తిరగబడే రోజులు వస్తున్నాయని హెచ్చరించారు.

హిందూ పేరుతో రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందన్నారు. దేశం కోసం ఆర్‌ఎస్‌ఎస్ ఎక్కడా పనిచేయలేదన్నారు. దేశ కోసం గాంధీ తన జీవితాన్ని త్యాగంచేశారని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌భగవత్ ఇండియాను హిందూ దేశం అంటున్నారని, మన దేశం లో అన్ని మతాల వారు ఉన్నారని తెలిపారు.