7 July, 2026 | 7:31 PM

Breaking News

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •   ఫర్టిలైజర్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు   •  

బీసీ ‘ఎ’ కులాలకు 12% రిజర్వేషన్లు కల్పించాలి

29-09-2025 01:11 AM

తెలంగాణ బీసీ‘ఎ’కులాల హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. బాగయ్య డిమాండ్

ముషీరాబాద్, సెప్టెంబర్ 28 (విజయ క్రాంతి):  బీసీలకు స్థానిక సంస్థల కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 42 శాతం రిజ ర్వేషన్లలో బీసీ ‘ఎ’కులాలకు జనాభా ప్రాతిపదిన వాటా కల్పించాలని తెలంగాణ బీసీ ‘ఎ’హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. భాగ్య భాగయ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్. నరహరిలు డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడి యా  సమావేశంలో వారు  మా ట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి  78 సంవత్సరాలు గడుసున్నప్పటికీ వెనుకబడిన కులాల్లో కేవలం 5 కులాలు మాత్రమే రిజర్వేషన్లు పొందుతున్నాయని, కాని బీసీ ‘ఎ’లోని 73 కులాలకు రిజర్వేషన్లలో అన్యా యం జరు గుతున్నదని, ముఖ్యంగా విద్యా, ఉద్యోగ రంగాలలో తీవ్రంగా అన్యాయం జరుగుతు న్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన జాబితా ను బహిర్గతం చేసి, వారి కులాల వారిగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 73 బీసీ  ‘ఎ’ కులాలకు12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీ ‘ఎ’జాబితాలో ఇతర స్థానిక, స్థానికేతర కులాలను చేర్చరాదని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నమితి ప్రతినిధులు రామ్ చందర్, జగదీష్, గడప శ్రీహరి, సుధాకర్, జితేందర్, రాజలింగం పాల్గొన్నారు.