30 August, 2026 | 8:27 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

మా పోరాటంతోనే బీసీలకు రిజర్వేషన్లు

01-09-2025 01:35 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (విజయక్రాంతి): స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కడం వెనుక తన నిరంతర పోరాటం, హైకోర్టులో వేసిన పిటిషనే కారణమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ య్య స్పష్టం చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థాని క సంస్థల రిజర్వేషన్లపై తమ సంఘం చేసిన కృషిని వివరించారు.

2024లో తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాతే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఈ విషయా న్ని అసెంబ్లీ సాక్షిగా అంగీకరించిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళా పక్షపాతి అని, అన్ని రంగాల్లో వారికి ప్రాతినిధ్యం కల్పించాలని ఆలోచిస్తున్నారని కృష్ణయ్య కొనియాడారు.

అయితే, పార్లమెంటులో ఆమోదం పొందిన మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్-కోటా ఇవ్వకపోతే అది అసంపూర్ణమే అవుతుందన్నారు. ఈ సమావేశంలోనే తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జి పద్మను నియమిస్తున్నట్లు ఆర్ కృష్ణయ్య ప్రకటించి, నియామక పత్రాన్ని అందజేశారు.