28-08-2025 05:45:51 PM
నకిరేకల్ (విజయక్రాంతి): పలు అభివృద్ధి పనులపై, కార్యాచరణపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham) నియోజకవర్గ వ్యాప్తంగా తహసిల్దార్, ఎంపీడీవో, ఇరిగేషన్ అధికారులతో గురువారం నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, తహశీల్దార్ యాదగిరి, ఎంపీడీవో జ్ఞాన ప్రకాష్ రావు,వెంకటేశ్వరరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.