28-08-2025 07:47:22 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్(Nirmal) ప్రెస్ క్లబ్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో పురస్కరించుకొని మట్టి గణపతిని ప్రతిష్టింపజేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయక స్వామికి నైవేద్యాన్ని సమర్పించారు. ఏడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రసం శ్రీధర్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు.