calender_icon.png 28 August, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో

28-08-2025 07:44:56 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల, కేజీబీవీ పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు(District Education Officer Rama Rao) గురువారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సిబ్బంది పాఠశాల విడిచి వెళ్ళవద్దని ప్రమాదకరంగా భవనాలు ఉంటే పక్క భవనాలకు పిల్లలను మార్చాలని సూచించారు. పిల్లలకు వేడివేడి ఆహారాన్ని అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.