18-08-2025 01:48:42 AM
మహబూబాబాద్, విజయక్రాంతి: వర్షాలకు బస్టాండ్ ఆవరణ బురదమయంగా మారి ప్రయాణికులు, బస్సులు వచ్చి వెళ్లడం ఇబ్బందికరంగా మారిందని, సమస్య పరిష్కరించాలని పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా గూడూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వరి నాట్లు వేసి ఎం సి పి ఐ నాయకులు నిరసన తెలిపారు.